News February 27, 2025

వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

image

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 15, 2025

ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

image

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లకు నాయకత్వం వహించారు.

News October 15, 2025

ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే!

image

క్రాసులా ఒవాటా అనే శాస్త్రీయ నామం గల ‘జేడ్’ ప్లాంట్ అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నాణెం ఆకారంలో ఉండే వీటి ఆకులు సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆగ్నేయ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెంచి ఒత్తిడి తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శాస్త్రీయంగా ఇది ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేసి బెంజీన్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది. Share It

News October 15, 2025

గూగుల్‌తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

image

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్‌లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్‌లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.