News April 14, 2025
వడగండ్ల వానకు నేలమట్టమైన పంటపొలాలను పరిశీలించిన కొమ్మూరి

పెంబర్తి, పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానకు నేలమట్టమైన పంటపొలాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం పరమైన సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News December 9, 2025
పెద్దపల్లి: ముగింపు దశకు మొదటి విడత ప్రచార పర్వం

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
నేడు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ ప్రాంగణంలో ఉదయం 10:00 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.
News December 9, 2025
NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 10.6, తెలకపల్లి 11.0, తాడూర్ మండలం యంగంపల్లిలో 11.1, అమ్రాబాద్లో 11.2, ఊర్కొండ 11.5, వెల్దండ 11.6, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


