News April 2, 2024
వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి: కలెక్టర్

రోజూరోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
Similar News
News November 27, 2025
KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
News November 27, 2025
రామడుగు: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
News November 27, 2025
కరీంనగర్కు వచ్చిన పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు

పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, HACA మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి గురువారం కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.


