News April 9, 2024
వడదెబ్బ నుంచి రక్షణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ నగరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వడదెబ్బ సూచనలు కనిపిస్తే సమీపములోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలన్నారు.
Similar News
News September 30, 2024
చల్లపల్లి: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చల్లపల్లి మండలం నూకలవారిపాలెం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇనుప చువ్వలలోడ్ లారీ ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కాగా ఆదివారం ఇదే అవనిగడ్డ నియోజకవర్గంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురికి గాయాలైన విషయం తెలిసిందే.
News September 30, 2024
కృష్ణా జిల్లాలో కొండెక్కిన కూరగాయల ధరలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టమాటా ధర ఠారెత్తిస్తోంది. గతవారం కేజీ రూ.40 పలికిన టమాటా ఆదివారం రూ.80కి పెరిగింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉల్లిపాయలు కేజి రూ.50, బీరకాయలు రూ.60, వంకాయలు రూ.80, దొండ కాయలు రూ.40కి అమ్ముతున్నారు. బెండకాయలు కేజి ధర రూ.50, బంగాళాదుంప రూ.40, క్యారెట్ రూ.50, పచ్చిమిర్చి రూ.50, అల్లం రూ.140, కాకరకాయ కేజీ ధర రూ.50గా ఉన్నాయి.
News September 30, 2024
మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు.