News May 26, 2024

వడమాలపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్ డెడ్

image

వడమాలపేట మండల పరిధిలోని పాదిరేడు బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కంటైనర్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞ అనే మహిళ(35) అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పొన్నేరికి చెందిన విజయకాంత్, ప్రజ్ఞ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా పాదిరేడు బైపాస్ వద్ద వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొంది .మృతదేహాన్ని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 16, 2026

ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

image

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

News March 16, 2026

సెలవులో చిత్తూరు కలెక్టర్

image

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

News March 16, 2026

చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

image

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.