News April 8, 2025

వడాలిలో భర్త వేధింపులతో నవవధువు బలవన్మరణం

image

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన గుండాబత్తుల తనుశ్రీ(19) భర్త వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూ.20వేలు తీసుకురమ్మని, గతంలో పెట్టిన కేసు రాజీ చేసుకోవాలని తన కుమార్తెను వేధింపులు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 5, 2025

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

image

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.

News December 5, 2025

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిటాల సునీత

image

అనంతపురం రూరల్ సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

News December 5, 2025

వరంగల్, హనుమకొండ కలయికపై చర్చ ఉంటుందా?

image

నర్సంపేట పర్యటనలో CM రేవంత్ రెడ్డి హనుమకొండ-వరంగల్ జిల్లాల కలయికపై స్పందిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలను గ్రేటర్ పరిధిలో సమన్వయంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేయగా.. ఆ మధ్య కాలంలో కలయిక ఉంటుందని భావించారు. సదుపాయాలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సేవలను ఒకే వ్యూహంతో ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని CM చెప్పొచ్చని రాజకీయ వర్గాల అంచనా.