News April 8, 2025
వడాలిలో భర్త వేధింపులతో నవవధువు బలవన్మరణం

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన గుండాబత్తుల తనుశ్రీ(19) భర్త వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూ.20వేలు తీసుకురమ్మని, గతంలో పెట్టిన కేసు రాజీ చేసుకోవాలని తన కుమార్తెను వేధింపులు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 14, 2025
మేడారం జాతరకు 1680 ఆర్టీసీ బస్సులు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2026 జనవరి 28-31 వరకు జాతర జరుగనుండగా, రోడ్లు, వసతుల అభివృద్ధికి పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ రీజియన్ నుంచి మాత్రమే 1,680 బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాను తెలిపారు. భక్తుల రాకపోకలు సులభం చేయేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
News November 14, 2025
నెల్లూరు: సైలెంట్ కిల్లర్కు చెక్ పెట్టేది ఎలా.?

మధుమేహ వ్యాధి గురించి జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. NOV 14 తేదీని ‘వరల్డ్ డయాబెటిస్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే మధుమేహానికి సరైన జీవనశైలితో చెక్ పెట్టొచ్చని అంటారు.
News November 14, 2025
పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.


