News April 8, 2025
వడాలిలో భర్త వేధింపులతో నవవధువు బలవన్మరణం

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన గుండాబత్తుల తనుశ్రీ(19) భర్త వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూ.20వేలు తీసుకురమ్మని, గతంలో పెట్టిన కేసు రాజీ చేసుకోవాలని తన కుమార్తెను వేధింపులు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 19, 2025
ఏలూరు: మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో.జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో మొత్తం 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310 పోస్టులు భర్తీ చేస్తారు. ఇటీవల జిల్లాకు మంజూరైన 166 స్పెషల్ పోస్టుల భర్తీని డీఎస్సీతో సంబంధం లేకుండా విడుదల చేస్తారు.
News April 19, 2025
ఆ లిస్టులో సెకండ్ ప్లేస్కు పాటీదార్

నిన్న పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.
News April 19, 2025
సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.