News April 11, 2025

వడ్డేపల్లి చెరువులో దూకి NIT విద్యార్థి ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. వడ్డేపల్లి చెరువులో దూకి వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్‌సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, హైదరాబాద్‌కు చెందిన అతను ఎన్‌ఐటీ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 25, 2025

మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

image

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.

News April 25, 2025

మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

image

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.

News April 25, 2025

హన్మకొండ: భార్యా భర్తలు అదృశ్యం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృశ్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

error: Content is protected !!