News February 26, 2025

వడ్డేపల్లి: నిప్పంటించుకుని ఓ వ్యక్తి సూసైడ్ ATTEMPT

image

నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వడ్డేపల్లి(M) శాంతినగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. అలంపూర్ మండలం క్యాతూర్‌కి చెందిన నర్సింహ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఈక్రమంలో 2 నెలలుగా వాయిదా కట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారు. దీంతో నర్సింహ ఫైనాన్స్ సిబ్బంది వద్దకు వెళ్లి వారి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన రైతులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 23, 2026

IDFC ఫస్ట్ బ్యాంక్‌లో ₹590 కోట్ల స్కామ్!

image

చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో ₹590 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. హరియాణా ప్రభుత్వ విభాగాలకు చెందిన అకౌంట్లలో ఈ గోల్‌మాల్ జరిగింది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హరియాణా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని, సాధారణ కస్టమర్ల సొమ్ము సేఫ్ అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది.

News February 23, 2026

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే WW-3ని ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. పుతిన్‌ను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచాలని BBCతో అన్నారు. రష్యా డిమాండ్ చేస్తున్నట్లుగా ఉక్రెయిన్ భూభాగాలను వదులుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు భూభాగాన్ని వదులుకున్నా పుతిన్ మళ్లీ దాడికి దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

News February 23, 2026

ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

image

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.