News February 26, 2025
వడ్డేపల్లి: నిప్పంటించుకుని ఓ వ్యక్తి సూసైడ్ ATTEMPT

నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వడ్డేపల్లి(M) శాంతినగర్లో జరిగింది. పోలీసుల వివరాలు.. అలంపూర్ మండలం క్యాతూర్కి చెందిన నర్సింహ ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఈక్రమంలో 2 నెలలుగా వాయిదా కట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారు. దీంతో నర్సింహ ఫైనాన్స్ సిబ్బంది వద్దకు వెళ్లి వారి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన రైతులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 23, 2025
PDPL: పత్తి రైతులకు కొత్త చిక్కులు.. స్లాట్ బుకింగ్ తప్పనిసరి

పత్తి పంట విక్రయించే రైతులకు సిసిఐ కొత్త నియమాలు తీసుకొచ్చింది. రైతులు తమ పత్తిని విక్రయించాలంటే వారం రోజుల ముందుగానే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తేదీ, సమయానికే కొనుగోలు కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. ఎక్కువసేపు క్యూలలో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండడమే ఈ విధానం లక్ష్యమని సీసీఐ వెల్లడించింది. కాగా పెద్దపల్లి జిల్లాలో 49 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.
News October 23, 2025
భద్రాద్రి: రోడ్డు ప్రమాద నివారణకు అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి అధికారులతో పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు అధికారులు సరైన ప్రణాళిక రూపొందించుకొని వాటిని అమలు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.
News October 23, 2025
JGTL: ‘విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి’

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈఓ రాము అన్నారు. సమగ్ర శిక్ష పాపులేషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు టీచర్స్ భవన్ లో బుధవారం నిర్వహించినారు. ఇందులో మొదటి స్థానంలో జఫ్స్ గుట్రాజ్ పల్లి, 2వ స్థానంలో TGMS గొల్లపల్లి, 3వ స్థానంలో ZPHS సుద్దపల్లి పాఠశాలలు నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు.