News February 26, 2025

వడ్డేపల్లి: నిప్పంటించుకుని ఓ వ్యక్తి సూసైడ్ ATTEMPT

image

నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వడ్డేపల్లి(M) శాంతినగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. అలంపూర్ మండలం క్యాతూర్‌కి చెందిన నర్సింహ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఈక్రమంలో 2 నెలలుగా వాయిదా కట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారు. దీంతో నర్సింహ ఫైనాన్స్ సిబ్బంది వద్దకు వెళ్లి వారి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన రైతులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 23, 2025

పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

image

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను RCB బెంచ్‌కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్‌లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

News March 23, 2025

TODAY HEADLINES

image

* డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్‌లాల్
* కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం

News March 23, 2025

₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

image

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.

error: Content is protected !!