News February 25, 2025

వడ్డేపల్లి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నరసింహ మంగళవారం పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నరసింహ లోన్ తీసుకొని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత అధికారులతో గొడవపడి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Similar News

News December 7, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌‌లోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో 50 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,60,226, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 7, 2025

సర్పంచ్‌గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

image

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It

News December 7, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

image

నూజివీడులో ట్రిపుల్ ఐటీ‌లో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.