News February 25, 2025
వడ్డేపల్లి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నరసింహ మంగళవారం పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నరసింహ లోన్ తీసుకొని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత అధికారులతో గొడవపడి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Similar News
News October 23, 2025
నెల్లూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 7995576699, 08612331261
➤పోలీస్ కంట్రోల్ రూమ్: 9392903413, 9440796383, 9440796370, 100
News October 23, 2025
ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News October 23, 2025
నేడు అన్నాచెల్లెళ్ల పండుగ.. మీరు చేస్తున్నారా?

రాఖీ లాగే కార్తీక శుక్ల పక్ష విదియ నాడు ‘భాయ్దూజ్’ పేరిట అన్నాచెల్లెళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ శుభదినాన యమునా దేవి తన సోదరుడు యముడికి ఆప్యాయంగా భోజనం పెట్టి, ఆయనకు అపమృత్యు భయం లేకుండా దీవించిందట. అందుకే సోదరీమణులు ఈ పర్వదినాన తమ సోదరులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు. సోదరుడు, సోదరి చేతి భోజనం తింటే దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్ముతారు. మీరు ఈ పండుగ చేస్తున్నారా? COMMENT


