News February 25, 2025

వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

image

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News October 17, 2025

రోజుకు 5KM పరుగు… అయినా 2 స్టెంట్లు

image

రోజుకు 5 కి.మీ పరిగెత్తడం అతడి దినచర్య. నిద్ర, ఆహార నియమాలను తూ.చ పాటిస్తుంటాడు. 15 ఏళ్లుగా ఇదే పాటిస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరలవుతోంది. హఠాత్తుగా అస్వస్థత అనిపించడంతో యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నట్లు తేలిందని, స్టెంట్లు వేశారని ఆయన పేర్కొన్నాడు. జాగ్రత్తలు తీసుకున్నా గుండె లయ తప్పిందన్నాడు. గుండె ఆరోగ్యం అనేక అంశాలతో ముడిపడి ఉంటుందనుకోవాలన్నాడు.

News October 17, 2025

MHBD: ఘనంగా అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

MHBD(D) దంతాలపల్లి(M) బీరిశెట్టిగూడేనికి చెందిన నాగలక్ష్మి-మురళీ దంపతుల కుమార్తెలు అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను స్టేట్ హోమ్‌(HYD)లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు అన్నారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరారు.

News October 17, 2025

MBNR: రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఏంఎస్ఎన్ రెడ్డి

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం నిర్మాణం కోసం మన్నె సత్యనారాయణ రెడ్డి రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘ఈ నేల పుట్టిన బిడ్డగా పాలమూరు విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడటం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఒకప్పుడు వలసల కోసం పేరుగాంచిన పాలమూరు, ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి సాధించడం గర్వకారణం’ అని అన్నారు.