News May 24, 2024

వడ్డేపల్లి బండ్‌కు పెనుముప్పు..!

image

HNK వడ్డేపల్లి చెరువు బండ్‌కు ముప్పు పొంచి ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వానాకాలంలో అనేక కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. GWMC అధికారులు వడ్డేపల్లి బండ్‌ పనులు అశాస్త్రీయంగా చేపట్టారని వారు బల్దియాకు సైతం లేఖ రాశారు.కాగా వడ్డేపల్లి చెరువు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని NIT రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ CSకి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Similar News

News February 10, 2025

గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..

image

గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్‌టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.

News February 10, 2025

హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 10, 2025

వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

image

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!