News February 24, 2025
వడ్డేపల్లి: బోర్ వెల్స్ బండి బోల్తా.. ఒకరు మృతి

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమవారం బోర్ వెల్స్ బండి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోర్ వెల్స్ బండిలో హెల్పర్గా పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీ మృతి చెందాడు. గ్రామంలో ఓ రైతుకు బోరు వేసేందుకు వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బోరు బండి బోల్తాపడటంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News December 4, 2025
పవన్ కళ్యాణ్కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.
News December 4, 2025
ఇసుక మాఫియా ఒత్తిడికి అధికారుల దాసోహం

పనులు నడుస్తున్నాయో లేదో తెలుసుకోకుండానే నిలిచిపోయిన పనుల పేరిట ఇసుక రవాణాకు అధికారులు అనుమతిస్తున్నారు. వేములవాడ ZP బాలికల హై స్కూల్ ఆవరణలో కంప్యూటర్ గది, లైబ్రరీ నిర్మాణం పనులు మూడు నెలల కింద ఆగిపోయినప్పటికీ తాజాగా 16 ట్రిప్పుల ఇసుకకు తహశీల్దార్ అనుమతి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. వాస్తవాలు పరిశీలించకుండానే ఇసుక మాఫియా ఒత్తిడికి, ముడుపులకు ఆఫీసర్లు తలొగ్గి అనుమతులిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News December 4, 2025
ADB: పల్లె నుంచే గడ్డెన్న ప్రస్థానం..!

ముధోల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పేరు గడ్డెన్న. భైంసా మండలం దేగం సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం 6 సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రి వరకు కొనసాగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. అందుకే ఆయనంటే పల్లె ప్రజల్లో ఓ గౌరవం. గడ్డెన్న తన బిడ్డలను నేరుగా పెద్ద పదవులు కట్టబెట్టవచ్చు కానీ అలా చేయలేదు. కొడుకు విఠల్ రెడ్డిని సర్పంచ్గా పోటీ చేయించి, క్రమంగా శాసనసభ వరకు తీసుకెళ్లారు.


