News February 24, 2025
వడ్డేపల్లి: బోర్ వెల్స్ బండి బోల్తా.. ఒకరు మృతి

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమవారం బోర్ వెల్స్ బండి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోర్ వెల్స్ బండిలో హెల్పర్గా పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీ మృతి చెందాడు. గ్రామంలో ఓ రైతుకు బోరు వేసేందుకు వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బోరు బండి బోల్తాపడటంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News September 16, 2025
వనపర్తి: నిరుద్యోగులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సహకారంతో సెప్టెంబర్ 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటేశ్వర్ల రాజు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలన్నారు. SSC, ITI, DEGREE అర్హతలన్నారు.
News September 16, 2025
దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.