News April 12, 2025

వనజీవి మనవరాళ్లకూ మొక్కల పేర్లే

image

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య <<16071045>>మృతితో<<>> పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. మొక్కలపై ఉన్న ప్రేమతో తన మనవరాళ్లకు కూడా వాటి పేర్లే పెట్టడం మరో ఆసక్తికర విషయం . వారికి చందనపుష్ప, హరిత లావణ్య. కబందపుష్ప అని పేర్లు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.

Similar News

News December 23, 2025

ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

image

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్‌కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 23, 2025

గంజాయిపై సిరిసిల్ల పోలీసుల ఉక్కుపాదం

image

మాదకద్రవ్యాల కట్టడికి సిరిసిల్ల పోలీసులు చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయి. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో 2024లో 98కేసుల్లో 265మందిని అరెస్టుచేసి 41.3 KGల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో 49 కేసుల్లో 141మందిని అరెస్టుచేసి 4.740 KGల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఏకంగా 50శాతం తగ్గుదల నమోదైంది.

News December 23, 2025

పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

image

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.