News February 26, 2025

వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

image

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.

Similar News

News December 5, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్

News December 5, 2025

సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్‌

image

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.

News December 5, 2025

సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

image

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.