News January 25, 2025
వనపర్తిలో డేంజర్ ఫుడ్.!

జిల్లాల్లోని విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇటీవల గద్వాలలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల11న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో ఒకరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. GWL, WNP, NGKL జిల్లాల్లోని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త.!
Similar News
News October 24, 2025
దీపావళి టార్గెట్.. ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ISIS కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరుగల ఇద్దరు ISIS ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్, పబ్లిక్ పార్క్లో దాడి చేసేందుకు సిద్ధమైన వీరిద్దరినీ ఢిల్లీ, భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. OCT 16నే వారిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు.
News October 24, 2025
వనపర్తి: మద్యం షాపులకు 757 దరఖాస్తులు

వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలో మొత్తం 757 దరఖాస్తులు వచ్చాయని జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 27న కలెక్టరేట్ సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ ప్రక్రియను చేపడతారని తెలిపారు.
News October 24, 2025
స్లీపర్ బస్సులు బ్యాన్ చేయాలా?

AP: కర్నూలు బస్సు <<18088805>>ప్రమాద<<>> ఘటనతో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8-9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటికెళ్లడం కష్టమై ప్రాణనష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?


