News March 21, 2025

వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష 

image

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

Similar News

News April 24, 2025

పీలేరు: నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

image

నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం గుర్రంకొండలో జరిగింది. పీలేరు మండలం కోటపల్లి వాసి మోసిన్ గుర్రంకొండ కుమ్మరిపల్లిలోని తన అత్తగారి ఇంటి దగ్గర తాపీ మేస్త్రి పని కోసం భార్యాబిడ్డలతో సహా వెళ్లి రెండు రోజులుగా అక్కడే పని చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో మోసిన్ కొడుకు అయాన్ (3) ఆడుకుంటూ బుధవారం సాయంత్రం 4 సమీపంలో పొరపాటున నీటి తొట్టిలో పడి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

News April 24, 2025

ఉగ్రదాడి.. 11 మందిని కాపాడిన కశ్మీరీ వ్యాపారి

image

J&K ఉగ్రదాడి నుంచి 4 కుటుంబాలకు చెందిన 11 మందిని కశ్మీరీ దుస్తుల వ్యాపారి నజకత్ అలీ కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు ఇటీవల పహల్‌గామ్ వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడే ఉన్న నజకత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వధావన్, కుల్దీప్ స్థాపక్ వెల్లడించారు.

News April 24, 2025

IPL: నేడు RCBvsRR.. గెలిచేదెవరో?

image

ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్‌లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.

error: Content is protected !!