News March 29, 2025

వనపర్తి: అందులో అలసత్వం వద్దు: కలెక్టర్

image

జిల్లాలో 451 మంది మరణించిన వృద్ధాప్య పెన్షన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, గ్రామాల వారీగా వివరాలు సేకరించి, మరణ ధృవపత్రం, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంక్ ఖాతా MPDO కార్యాలయంలో అందిస్తే APR 10లోగా వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోయిన వారి స్థానంలో భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడంలో అలసత్వం వహించరాదన్నారు.

Similar News

News December 9, 2025

ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

image

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

News December 9, 2025

తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

image

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 9, 2025

కృష్ణా: టిడ్కో ఇళ్లు రెడీ.. సంక్రాంతి కానుకగా పంపిణీ..!

image

ఉమ్మడి కృష్ణాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని L&T సంస్థ చేపట్టింది. NTRలో జక్కంపూడి దగ్గర 6,776 ఇళ్లు నిర్మిస్తుండగా 1,104 సంక్రాంతికి ఇవ్వనున్నారు. మచిలీపట్నం రుద్రవరం వద్ద 2,300 నిర్మిస్తుండగా 1,008 ఇళ్లు జనవరిలో లబ్దిదారులకు ఇవ్వనున్నారు. ఇక జగ్గయ్యపేట 3,168, తిరువూరు 1,536, నందిగామ 240, ఉయ్యురు 2,496 టిడ్కో ఇళ్లు 75% పూర్తవుగా.. వచ్చే ఏడాది మే-జూన్ నాటికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.