News February 27, 2026
వనపర్తి: అదనపు కలెక్టర్గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 15, 2026
విశాఖలో దారుణం.. కూలీని కొట్టి చంపిన తోటి కూలీలు

మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. ఝార్ఖండ్కు చెందిన సికింధర్(19)కు తోటి కూలీలైన శ్యామ్, నజురుల్లతో మంగళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకి తరలించారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
తాడిపత్రిలో కీచక అధికారి

తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. సచివాలయ, అవుట్సోర్సింగ్ ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు సదరు అధికారికి దేహశుద్ధి చేసినా తీరు మారలేదట. ఆ కీచక అధికారి వ్యవహారాలు బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని తొక్కిపెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.


