News March 29, 2025

వనపర్తి: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు.. పోలీసుల WARNING

image

పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT

Similar News

News October 16, 2025

సంగారెడ్డి: ‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వరకు పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోజాతి, గేదె జాతి పశువుల రైతులు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News October 16, 2025

నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని

image

నేడు శ్రీశైలం మల్లన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఉదయం 11:15 ని శ్రీశైలంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

News October 16, 2025

వనపర్తి: 24 గంటలు నమోదైన వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో ఉన్న 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటలో నాలుగు కేంద్రాలలో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జానంపేటలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరంగాపురం 6.8 మిల్లీమీటర్లు, పెబ్బేరు 4.8 మిల్లీమీటర్లు, దగడలో 1.8 మిల్లీమీటర్లు, మిగతా 17 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.