News January 29, 2025
వనపర్తి: ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

గోపాల్పేట మండలానికి చెందిన బెంజిమన్ ప్రభాకర్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి సెలక్ట్ అయ్యారు. నేపాల్లోని ఖాట్మాండులో వచ్చే నెల 14న జరగబోయే టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రభాకర్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.
News November 10, 2025
ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

AP: హైస్కూల్ ప్లస్లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
News November 10, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ANM దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన<<18244517>> రోడ్డు ప్రమాదం<<>>లో ఏఎన్ఎం దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మం. గంగాపురం వాసి ఎర్రోళ్ల నర్సయ్య.. భార్య సునీత(30), కుమార్తె కీర్తనతో కలిసి బైక్పై చేర్యాల నుంచి వస్తున్నారు. లేనిన్నగర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సునీత స్పాట్లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి బిడ్డను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సునీత శనిగరం PHCలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది.


