News January 29, 2025
వనపర్తి: ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

గోపాల్పేట మండలానికి చెందిన బెంజిమన్ ప్రభాకర్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి సెలక్ట్ అయ్యారు. నేపాల్లోని ఖాట్మాండులో వచ్చే నెల 14న జరగబోయే టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రభాకర్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News November 28, 2025
వనపర్తిలో 87 పంచాయతీలకు 232 నామినేషన్లు

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు రెండు రోజుల్లో మొత్తం 232 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 157 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మండలాల వారీగా (శుక్రవారం):
పెద్దమందడి: 63
ఘనపూర్: 53
రేవల్లి: 19
గోపాల్పేట: 14
ఏదుల: 08
News November 28, 2025
మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 28, 2025
కొమురం భీం జిల్లా SC-ST టీచర్స్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక

ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ కొమురం భీం జిల్లా శాఖ 2026-28 పదవీకాలానికి ఎన్నికలు రెబ్బెన జడ్పీహెచ్ఎస్లో రాష్ట్ర సలహాదారు జాడి కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా దుర్గం తులసిరామ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి రాజేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు, రిజర్వేషన్ల అమలు, అంబేడ్కర్ భావాల సాధనకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.


