News March 31, 2025
వనపర్తి: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల

ముస్లింలు పవిత్రంగా చేసుకునే పండగనే రంజాన్ అని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి ఉపవాస దీక్షలను విరమింప చేశారు. అనంతరం రావుల ముస్లింలతో మసీదులో ప్రార్థన లు చేశారు. రావుల మాట్లాడుతూ ముస్లింలు దేశం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్ పండగను ప్రశాంతంగా చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 24, 2025
అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగర్హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.
News November 24, 2025
BMC బ్యాంక్లో ఉద్యోగాలు

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bmcbankltd.com/
News November 24, 2025
భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్మెంట్లు (సూపర్ స్పెషలిస్ట్లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.


