News March 31, 2025
వనపర్తి: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల

ముస్లింలు పవిత్రంగా చేసుకునే పండగనే రంజాన్ అని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి ఉపవాస దీక్షలను విరమింప చేశారు. అనంతరం రావుల ముస్లింలతో మసీదులో ప్రార్థన లు చేశారు. రావుల మాట్లాడుతూ ముస్లింలు దేశం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్ పండగను ప్రశాంతంగా చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 23, 2025
SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
News November 23, 2025
సాయి బోధనలతో జీవితంలో ప్రశాంతత: VVS లక్ష్మణ్

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బాబాను స్మరించుకున్నారు. ప్రేమ, సేవ, కరుణతో కూడిన బాబా సందేశం తమకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మహనీయుని ఆశీస్సులు, స్ఫూర్తి ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని లక్ష్మణ్ ఆకాంక్షించారు.
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.


