News February 14, 2025
వనపర్తి: ఇసుకను అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు: జిల్లా కలెక్టర్

వనపర్తి జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని, దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సూచించారు. ఈ విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ 08545-233525కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News November 2, 2025
‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.
News November 2, 2025
మహబూబ్నగర్: ‘జీతం సరిపోవట్లేదా మేడం..?’

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే WINE షాప్ దక్కించుకునేందుకు టెండర్ వేసిన PET <<18173568>>పుష్ప మేడం వ్యవహారం<<>> చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వోద్యోగులుగా చేసేవారు CCA రూల్స్ ప్రకారం ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, అది నిబంధనలకు విరుద్ధమని, అందుకే PETని విధుల నుంచి సస్పెండ్ చేశామని DEO స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ‘సర్కార్ కొలువు చేస్తున్నారు, జీతం సరిపోట్లేదా మేడం’ అని ప్రజలు పుష్ప మేడంను ప్రశ్నిస్తున్నారు.
News November 2, 2025
ఈనెల 11న కొత్తగూడెంలో జాబ్ మేళా

సింగరేణి సహకారంతో కొత్తగూడెం క్లబ్లో ఈ నెల 11న నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుతో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ చదివి18-40 ఏళ్ల వయస్సు గల వారు అర్హులన్నారు.


