News March 29, 2025

వనపర్తి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ గిరిధర్

image

ఉగాది పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగను ప్రజలంతా ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్పీ పేర్కొన్నారు. బంధు మిత్రులతో సంతోషంగా ఉగాది పండగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News November 16, 2025

మద్యం తాగడం వల్లే బస్సు యాక్సిండెంట్: KMR SP

image

మద్యం తాగి డ్రైవ్ చేసే వారిపై, నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవని KMR SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. బిక్కనూర్ PS పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రావెల్స్ సంస్థ & డ్రైవర్ రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News November 16, 2025

ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

image

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.

News November 16, 2025

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ కార్తీక్ రెడ్డి

image

బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి (39) పంపనూరు పుణ్యక్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంపనూరు క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ దర్శనానికి వచ్చి సమీపంలోని కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినట్లు వివరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.