News March 26, 2025

వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

image

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.

Similar News

News September 13, 2025

ములుగు: అత్యధికంగా వర్షం పడింది ఇక్కడే!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా వెంకటాపురం మండలంలో 106.5 మి.మీ. వర్షం కురిసింది. వాజేడు మండలం ధర్మారంలో 63మి.మీ., వాజేడులో 37మి.మీ., వెంకటాపూర్ లో 28.8మి.మీ., గోవిందరావుపేటలో 23.8మి.మీ., ఏటూరునాగారంలో 22.3మి.మీ. వర్షం పడింది.

News September 13, 2025

రాయికల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

రాయికల్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయోధ్య నుంచి రాయికల్ వైపు వస్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2025

మంచిర్యాల: గిరిజనుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్‌తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గిరిజనులతో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కింద వెదురు సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.