News March 26, 2025

వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

image

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.

Similar News

News November 15, 2025

HYD: గవర్నర్ అవార్డ్స్.. 2025 నామినేషన్లకు ఆహ్వానం

image

గవర్నర్ అవార్డ్స్–2025 కోసం నామినేషన్లను ఆహ్వానిస్తూ HYD రాజ్‌భవన్ ప్రకటించింది. 2020 నుంచి తమ తమ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, ట్రస్టులు ఈ అవార్డులకు అర్హులని తెలిపింది. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫీల్డ్, కార్పొరేట్ వాలంటీరింగ్ ముఖ్య విభాగాలు. నామినేషన్లు 5 డిసెంబర్ 2025 సా. 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి.

News November 15, 2025

జగిత్యాల: యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమావేశ మందిరంలో శనివారం జిల్లా క్రిస్టియన్ ఫెలోషిప్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2025-27 రెండు సంవత్సరాల అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు గాను ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవ తీర్మానంచేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో గౌరవ అధ్యక్షుడిగా సమూయేలు నాయక్, జిల్లా అధ్యక్షులుగా జీవరత్నం, ఉపాధ్యక్షులుగా ఏలీయా మెంగు, శాంతి కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.

News November 15, 2025

నిర్మల్ జిల్లా ప్రజలంతా కాంగ్రెస్ వైపే: డీసీసీ అధ్యక్షుడు

image

బీజేపీ, బీఆర్ఎస్ పనితీరు నచ్చక కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ కంటికి కనిపించకపోవడం సిగ్గుచేటు అని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.