News March 26, 2025

వనపర్తి: ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ: బచ్చు రాము

image

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుందని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో బచ్చు రాము మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 14, 2025

రైతులకు అండగా ఉంటాం: బాపట్ల కలెక్టర్

image

రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శనివారం బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీ తీరును పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని సకాలంలో యూరియా అందించే విధంగా చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. యూరియా పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 14, 2025

కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

image

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.

News September 14, 2025

నిర్మల్: ‘లోక్ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం’

image

లోక్ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి సుజన కళాసికం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వరకట్నం, గృహహింస, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులను తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఎస్పీ, కలెక్టర్, జిల్లా జడ్జి తదితరులు పాల్గొన్నారు.