News March 26, 2025
వనపర్తి: ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ: బచ్చు రాము

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుందని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో బచ్చు రాము మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
కోడూరు: ‘ట్రైన్లో నిద్రిస్తూనే కన్నుమూశాడు’

కోడూరు(M) పోటుమీదతకు చెందిన శీలం బాపనయ్య(65) షిరిడీ యాత్రకు వెళ్లి మంగళవారం ఉదయం మృతి చెందారు. సోమవారం ఇంటి వద్ద నుంచి తోటి యాత్రికులతో కలిసి షిరిడీ బయలుదేరారు. మంగళవారం షిరిడీ సమీపంలో నాగర్ సోల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేందుకు నిద్రిస్తున్న బాపనయ్యను లేపగా అప్పటికే మృతి చెందినట్లు తోటి వారు తెలిపారు. బాపనయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News October 14, 2025
మల్దకల్: ప్రియాంక మృతికి కారకురైన వారిని వదిలేది లేదు- ఎమ్మెల్యే

మల్దకల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మల్దకల్లో మృతదేహంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రియాంక మృతిపై పూర్తిస్థాయి పోలీసులతో విచారణ చేస్తామన్నారు.
News October 14, 2025
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా క్యూలో

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంది మార్బలం, హంగు ఆర్భాటాలతో నానా హంగామా చేస్తుంటారు కొందరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా ఉండడమే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య నైజం. బస్సులో అసెంబ్లీకి వెళ్లిన ఆయన సింప్లిసిటీ అందరికీ తెలిసిందే. తాజాగా కంటి పరీక్షల కోసం పాల్వంచ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి సైకిల్పై వెళ్లడం, ఓపీ క్యూలో నిలబడడం అందరి దృష్టిని ఆకర్షించింది.