News February 11, 2026

వనపర్తి: ఓటేసిన 102 ఏళ్ల బామ్మ..!

image

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో 102 ఏళ్ల వృద్ధురాలు జహీరాబీ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు 102 సంవత్సరాలు నిండాయని, మొదట వేసిన ఓటు గుర్తులేదని జహీరాబీ చెప్పారు. ఆమె ఓటేసేందుకు ఎస్ఐలు స్వాతి, శివకుమార్ సహకరించారు. ఎస్ఐలు మాట్లాడుతూ.. జహీరాబీని అందరూ ఆదర్శంగా తీసుకుని ఓటేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 17, 2026

IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

image

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.

News March 17, 2026

జానకంపల్లి విద్యార్థికి నవోదయలో జిల్లా మొదటి ర్యాంకు

image

జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిషిత్ చంద్ర 97.5 మార్కులు సాధించి కామారెడ్డి జిల్లాలో ప్రథమ ర్యాంకు సాధించారని మండల విద్యాధికారి రాజులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయి ర్యాంకు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు వసంతను అభినందించారు.

News March 17, 2026

డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: కలెక్టర్

image

ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు(AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.