News March 2, 2025

వనపర్తి: కాశీంనగర్ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం: సీఎం

image

వనపర్తి జిల్లాలో కాశీంనగర్ ఎత్తిపోతలను తప్పకుండా పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరులో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లేనని అన్నారు. వనపర్తిలో మహిళా సంఘాలకు రూ.వేయ్యి కోట్లు ఇస్తున్నామని తెలిపారు. వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.

Similar News

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు పక్కా: జగ్గారెడ్డి

image

జూబ్లీహిల్స్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​ యాదవ్​ పక్కా గెలుస్తాడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని, పథకాలతో పాటు అభివృద్దికి పెద్దపీట వేస్తుందన్నారు. అందుకే జూబ్లీహిల్స్​ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి నవీన్​ యాదవ్‌‌ను గెలిపించాలని ఓటర్లు జగ్గారెడ్డి కోరారు. ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.

News November 9, 2025

పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

image

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్‌అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్‌లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News November 9, 2025

శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి బుకింగ్

image

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR <<18224903>>మరిన్ని<<>> ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని IRCTC వెల్లడించింది.