News March 2, 2025
వనపర్తి: కాశీంనగర్ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం: సీఎం

వనపర్తి జిల్లాలో కాశీంనగర్ ఎత్తిపోతలను తప్పకుండా పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరులో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లేనని అన్నారు. వనపర్తిలో మహిళా సంఘాలకు రూ.వేయ్యి కోట్లు ఇస్తున్నామని తెలిపారు. వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.
Similar News
News November 27, 2025
విజయనగరం: ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్ ఎక్కించే సమయంలో గందరగోళానికి గురయ్యారు. ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మరొకరికి ఎక్కించారు. O పాజిటివ్ మహిళకు B పాజిటివ్, B పాజిటివ్ మహిళకు O పాజిటివ్ ఎక్కించారు. వెంటనే తప్పును గుర్తించి వారికి చికిత్స అందించారు. దీనిపై సూపరింటెండెంట్ డా.పద్మజ విచారణ చేపట్టారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
News November 27, 2025
GNT: ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం..!

గుంటూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రోసూరుకు చెందిన ఓ బాలిక నగరంలో బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య ఆ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత బాలికకు వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఈ క్రమంలో పోక్సో నమోదు చేశామన్నారు.


