News March 13, 2025

వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

image

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్‌గల్ జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.

Similar News

News October 29, 2025

NRPT: మాతృ మరణాలు తగ్గించాలంటూ కలెక్టర్ ఆదేశాలు

image

జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పరిధిలో నమోదైన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణీలకు సమయానికి ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.

News October 29, 2025

NRPT: రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోండి

image

నారాయణపేట జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లులలో అనగా 1 భాగ్యలక్ష్మి జిన్నింగ్ మిల్ లింగంపల్లి, 2 విజయ కాటన్ జిన్నింగ్ మిల్ తిప్రాస్ పల్లి తేదీ 30 నుంచి 31 వరకు సీసీఐ వారికీ పత్తి అమ్ముటకు స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోవాలని మార్కెట్ అధికారులు కాన్సిల్ చేసుకోవాలని కోరారు. వర్షాలు కురుస్తున్నాయని సీసీఐ వారు కొనుగోలు చేయడం లేదన్నారు.

News October 29, 2025

ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

image

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.