News March 28, 2025
వనపర్తి: గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వినతి

బంజారా గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా వాసి, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పదవి విషయంలో కేసీ వేణుగోపాల్తో చర్చించామన్నారు. తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని చెప్పామన్నారు.
Similar News
News December 13, 2025
అమలాపురం మాజీ ఎంపీ కన్నుమూత

అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి(85) శనివారం తెల్లవారుజామున ఢిల్లీలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మూడు సార్లు ఎంపీగా ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం అయినవిల్లి మండలం విలసలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 13, 2025
ఒకే బిల్వ పత్రంతో ఎన్నిసార్లైన పూజ చేయవచ్చా?

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.
News December 13, 2025
లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.


