News March 28, 2025
వనపర్తి: గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వినతి

బంజారా గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా వాసి, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పదవి విషయంలో కేసీ వేణుగోపాల్తో చర్చించామన్నారు. తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని చెప్పామన్నారు.
Similar News
News December 11, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో మరణించిన పెద్దింటి లక్ష్మీనారాయణ భార్య పెద్దింటి రంగమ్మకు రూ.2 లక్షలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసుల్లో 101 మంది బాధితులకు మొత్తం రూ.82లక్షలు అందించినట్లు చెప్పారు.
News December 11, 2025
షాద్నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

షాద్నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
News December 11, 2025
కడప: గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వర్ధంతి

కడప జిల్లా వాసులు గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని మరువలేరు. ఆమె గానం చేసిన వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతి శనివారం ఉదయం కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి ప్రసారమవుతుంది. ఆమె పాటలు గుండెల్లో గుర్తుండిపోయాయని, ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె గానం ఎప్పుడూ గుర్తుంటుందని కడప వాసులు గురువారం ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు.


