News March 16, 2025
వనపర్తి: గ్రూప్ 3కి ఎంపికైన కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ

టీజీపీఎస్సీ నిన్న ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాల్లో స్టేట్ 364 ర్యాంకులు సాధించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థిని పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం అభినందించి సన్మానించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన కృష్ణమూర్తిని ఎంపీ అరుణ శాలువా పూలమాలతో సన్మానించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన కృష్ణమూర్తిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ అన్నారు.
Similar News
News October 22, 2025
TTD: 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి.
News October 22, 2025
ప్రకాశం: విద్యుత్ షాక్తో తండ్రీకొడుకు మృతి.!

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్పై గ్రామానికి వెళ్తున్న తండ్రీకొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య(60), మాదాల వెంకటేశ్వర్లు(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 22, 2025
పేల సమస్యకు ఈ డివైజ్తో చెక్

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.