News March 16, 2025

వనపర్తి: గ్రూప్ 3కి ఎంపికైన కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ

image

టీజీపీఎస్సీ నిన్న ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాల్లో స్టేట్ 364 ర్యాంకులు సాధించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థిని పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం అభినందించి సన్మానించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన కృష్ణమూర్తిని ఎంపీ అరుణ శాలువా పూలమాలతో సన్మానించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన కృష్ణమూర్తిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ అన్నారు.

Similar News

News February 10, 2026

నిర్మల్: ప్రచార హోరు.. ఇక డిజిటల్ జోరు

image

మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి తెరపడటంతో అభ్యర్థుల దృష్టి సోషల్ మీడియాపై పడింది. నిబంధనల ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలకు సమయం ముగియడంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను వేదికగా చేసుకున్నారు. తమ ప్రాధాన్యతలు, గత అభివృద్ధి పనుల వీడియోలు, ఆకర్షణీయమైన ఫ్లెక్సీలను షేర్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఇంటింటికీ చేరుతూ మద్దతు కోరుతున్నారు.

News February 10, 2026

HYD: చనిపోయినా పెన్షన్ ఇస్తాం.. వాడుకోండి

image

‘అయ్యో! మీరు చనిపోయారా.. ఏం పర్లేదు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోవు.. మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఏ లోకంలో ఉన్నా వాడుకోవచ్చు’ ఇది సర్కారు తీరు. ఫతుల్లాగూడకు చెందిన జంగయ్య, బండ్లగూడకు చెందిన పోచయ్యలు ఎప్పుడో చనిపోయారు. అయినా వారి అకౌంట్లలో వృద్ధాప్య పెన్షన్ పడుతోంది. త్యాయగరాయనగర్‌కు చెందిన వీరభద్రయ్య(దివ్యాంగుడు) చనిపోయినా 5ఏళ్లుగా నెలకు రూ.4,016 జమ అవుతోందంటే మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు.

News February 10, 2026

ప్రైవేటుకు 4 NHలు.. జాబితాలో ఏపీ హైవే

image

AP: నాలుగు రాష్ట్రాల్లోని 260 కి.మీ పొడవైన 4 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. వీటికి రూ.9,500 కోట్లు చెల్లిస్తామని RIIT చేసిన ఆఫర్‌కు NHAI ఆమోదం తెలిపింది. ఇందులో 69 కి.మీ పొడవైన విజయవాడ-చిలకలూరిపేట హైవే కూడా ఉంది. మిగిలిన రహదారులు తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.