News February 8, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News January 9, 2026

వేములవాడ: ఈ నెల 21న కోడెల పంపిణీ

image

వేములవాడ పట్టణం తిప్పాపూర్‌లోని గోశాలలో ఈ నెల 21న కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులన్నారు.

News January 9, 2026

కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్‌ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్‌కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్‌లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.

News January 9, 2026

వేములవాడ: భీమేశ్వరుడికి కోటిన్నర ఆదాయం

image

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. గత 15 రోజులకు గాను హుండీ ద్వారా రూ.1,15,17,894 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. నగదుతో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్నారు. ఈవో పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.