News April 9, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణకు అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తన తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Similar News
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
నందిగామలో గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

నందిగామలో విద్యార్థిని నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. అనాసాగరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి నందిగామలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కళాశాల నుంచి స్నేహితురాళ్లతో సదరు విద్యార్థిని బయటకు వచ్చింది. నడుస్తూనే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
News September 16, 2025
MP బండి, వార్తా ఛానళ్లపై KTR పరువు నష్టం దావా..!

MP బండిపై MLA KTR పరువునష్టం దావా వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఇందుకు రూ.10కోట్ల పరిహారం చెల్లించాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. MP చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన, ప్రచురించిన పలు వార్తాఛానళ్లు, డిజిటల్ సైట్లపైనా KTR దావావేశారు. కాగా, AUG 8న ఫోన్ ట్యాపింగ్, ఇతరవాటిపై బండి KTRపై ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ముందుగా తనకు క్షమాపణ చెప్పాలని KTR కోరినా MP నో చెప్పడంతో కోర్టుకెళ్లారు.