News February 8, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 21, 2025

నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు

image

నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సోయాబీన్ సేకరణ చేపట్టనున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాల్ లకు పరిమితిని పెంచిందని వెల్లడించారు. కావున రైతులు గమనించి సోయాబీన్ ను 12% తేమ ఉండేటట్లు ఎండబెట్టి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 పొందవచ్చని సూచించారు.

News November 21, 2025

జడేజాను వదులుకోవడంపై ఆశ్చర్యపోయా: కుంబ్లే

image

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను CSK వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నారు. ‘మామూలుగా CSK తమ ప్లేయర్లను వదులుకోదు. ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగుతున్న జడేజా లాంటి వారిని అస్సలు వెళ్లనివ్వదు’ అని చెప్పారు. జడేజాను రాజస్థాన్, శాంసన్‌ను CSK తీసుకోవడం పెద్ద పరిణామం అని తెలిపారు. అయితే జడేజాకు RR మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న అన్నారు.

News November 21, 2025

పకడ్బందీగా పంట కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పంటల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి, సోయా, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అన్ని పంటలను కొనుగోలు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.