News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 23, 2025
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

* రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
* SLBC టన్నెల్ను పూర్తిచేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించాలని నిర్ణయం
* అల్వాల్, సనత్నగర్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం
* కాలపరిమితి ముగియడంతో రామగుండంలోని 52ఏళ్ల నాటి థర్మల్ స్టేషన్ను తొలగించడానికి ఆమోదం
News October 23, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 23, 2025
MHBD: 1800 దరఖాస్తులు.. రూ.54 కోట్లు ఆదాయం

జిల్లాలో 61 మద్యం షాపులకు 1800 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ తెలిపారు. MHBD 667, తొర్రూర్ 769, గూడూరు 364 స్టేషన్ల వారీగా 1800 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరంలో మొత్తం 2,589 దరఖాస్తులకు 51.78 కోట్లు, 2025లో మొత్తం 1800 దరఖాస్తులకు రూ.3 లక్షల చొప్పున రూ.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలో ఈ 27 తేదీన లక్కీ డ్రా ఉంటుందన్నారు.