News February 13, 2025
వనపర్తి: జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News March 19, 2025
సంగారెడ్డి: 24 లోపు పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలో ఉపాధి హామీ, పంచాయతీల శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు ఈనెల 24 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ జ్యోతి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
News March 19, 2025
వనపర్తి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

సీతారాముల కళ్యాణం తిలకించడానికి భద్రాచలం వెళ్లని వారికి ఆర్టీసీ వారు కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. రూ.151 చెల్లించి రసీదు పొందితే భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే చేర్చుతారన్నారు. వివరాల కోసం వనపర్తి-9866344200, పెబ్బేరు-8801828143, కొత్తకోట-8886848518, ఆత్మకూర్-7382829494లో సంప్రదించాలన్నారు.