News February 12, 2025

వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

Similar News

News December 24, 2025

భూపాలపల్లి: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

భూపాలపల్లి జిల్లాలో యాసంగి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ముగుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు పండిస్తున్న వారికి మాత్రమే భరోసా ఇస్తామని మంత్రి ఇటీవల ప్రకటించారు.

News December 24, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే, 27, 28 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 29 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

News December 24, 2025

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 26,210 వద్ద.. సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 85,611 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టెక్‌మహీంద్రా, ఇన్ఫీ, TMPV, సన్‌ఫార్మా, HCL టెక్ నష్టాల్లో ఉన్నాయి.