News February 12, 2025
వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
Similar News
News December 5, 2025
పాలమూరు: ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. బాండ్ పేపర్

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతక్రియల నిమిత్తం రూ.5 వేలు ఇస్తామని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోరు కవిత రాసిన హామీ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను గెలిపిస్తే ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యార్థులకు సాయంత్రం ఉచిత తరగతులు, అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్ తదితర 12 హామీలతో బాండ్ పేపర్ రాశారు. ఆమె BSC,B.ED పూర్తి చేసింది.
News December 5, 2025
గన్నవరం: వల్లభనేని వంశీ అనుచరుల్లో మరొకరి అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల్లో ఒకరైన యర్రంశెట్టి రామాంజనేయులు (ఏ9) పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇతను కీలకంగా వ్యవహరించి ఉన్నాడు. గురువారం కేసరపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఇతను పరారీలో ఉన్నాడు. శుక్రవారం అతనిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇటీవల పలువురు వంశీ అనుచరులు కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
News December 5, 2025
అనకాపల్లి: పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి

పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించి ఇన్సూరెన్స్ బాండ్లను పోలీస్ సిబ్బందికి అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసులకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు శ్రమించే పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.


