News February 12, 2025

వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

Similar News

News December 4, 2025

పొన్నూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బాపట్ల కలెక్టర్

image

పొన్నూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని బాపట్ల కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ సందర్శించారు. గురువారం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయాన్ని దర్శించడం ఆనందంగా ఉందన్నారు.

News December 4, 2025

ఆఫర్లను రద్దు చేసిన 20 సంస్థలపై IITల బ్యాన్

image

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్‌మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్‌కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్‌మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.

News December 4, 2025

హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు.. హత్య అంటూ లేఖ

image

<<18318593>>హిడ్మా<<>> ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. హిడ్మా, శంకర్‌ను ఎన్‌కౌంటర్ చేయలేదని, ఇది పూర్తిగా భూటకపు హత్యలని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్తుండగా అరెస్ట్ చేశారన్నారు. వారం రోజుల పాటు వారిని చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. హత్యలపై న్యాయవిచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.