News February 19, 2025
వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.
Similar News
News November 27, 2025
NTR: టెన్త్ పరీక్షలకు 27,797 మంది విద్యార్థులు సిద్ధం

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27,797 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈఓ యు.వి. సుబ్బారావు తెలిపారు. వీరిలో 14,184 మంది బాలురు, 13,613 మంది బాలికలు ఉన్నారు. నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
News November 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 85,900 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు వృద్ధి చెంది 26,281 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, మారుతీ, TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News November 27, 2025
శబరిమల యాత్రికుల విశ్రాంతి ప్రదేశం

శబరిమలకు వెళ్లే యాత్రికులు బస చేసే ప్రాంతమే ‘శిరియాన వట్టం’. ఒకప్పుడు ఇక్కడ ఏనుగుల సంచారం అధికంగా ఉండేది. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో వాటి రాక తగ్గింది. ఈ ప్రాంతం శబరిమల యాత్రికులకు ముఖ్యమైన విడిది కేంద్రంగా మారింది. తమ కఠినమైన ప్రయాణంలో అలసిపోయిన భక్తులు ఇక్కడి నుంచి పంబ నది వరకు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంటారు. వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు. <<-se>>#AyyappaMala<<>>


