News February 19, 2025
వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.
Similar News
News November 13, 2025
షమీపై లక్నో, ఢిల్లీ ఆసక్తి

SRH స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని Cricbuzz తెలిపింది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్లైన్ ముగియనుండగా SRH షమీని వదులుకోవచ్చని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ రూ.10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు.
News November 13, 2025
మక్తల్లో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్

మక్తల్లో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో పాలమూరు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. దీంతో మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఉట్కూరు ప్రాంతాల విద్యార్థులు ఇకపై నారాయణపేట వెళ్లే ఇబ్బంది తప్పింది. త్వరలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం కూడా సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
News November 13, 2025
తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>


