News March 17, 2025

వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేరు 42.1, విలియంకొండ 41.6, పెద్దమందడి 41.1, వనపర్తి 40.7, రేమద్దుల 40.7, గనపూర్ 40.4, వెలుగొండ 40.4, రేవల్లి 40.3, ఆత్మకూర్ 40.3, మదనపూర్ 39.9, దగడ 39.9, పాన్గల్ 39.6, సోలిపూర్ 39.6, గోపాల్ పేట 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 18, 2025

ఆసిఫాబాద్-ఉట్నూర్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి: MLA

image

ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే హస్నాపూర్ ప్రధాన రహదారి చాలా అధ్వానంగా మారిందని.. ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కెరమెరి ఘాట్లో నిత్యం వాహనాలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాలని కోరారు. 6 కిలోమీటర్లు ఉన్న సింగిల్ రోడ్డుకు వెడల్పు పెంచాలని కోరారు.

News March 18, 2025

సత్యసాయి: ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు దొర్లరాదు

image

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.

News March 18, 2025

ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

image

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్‌ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

error: Content is protected !!