News April 14, 2025
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన నిన్న పాన్గల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అన్నారం, దావాజీపల్లి గ్రామాల మధ్య పాన్గల్ వాసి ఆర్ఎంపీ స్వాములు, నాగవరం వాసి నాగేంద్ర ఇద్దరు బైకులు ఎదురెదుగా వచ్చి ఢీకొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాగేంద్రకు తీవ్రగాయాలు కావటంలో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎంపీ కాలు విరగటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 30, 2025
MHBD- తొర్రూర్ రహదారిపై కూలిన చెట్టు

తుఫాను బీభత్సానికి శనిగపురం వద్ద మహబూబాబాద్ – తొర్రూరు ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. దీని కారణంగా వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబాబాద్ – చిన్నగూడూరు రహదారిపై కూడా చెట్లు విరిగిపడటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
News October 30, 2025
మిడ్ మానేరులో 5 గేట్లు ఎత్తివేత

సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి మిడ్ మానేరు జలాశయంలో నీటిమట్టం 317.80 మీటర్లకు చేరింది. మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలలో 27.04 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం 14 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 13,175 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. నీటి ప్రవాహం నియంత్రణ కోసం 5 గేట్లు ఎత్తివేయగా, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News October 30, 2025
MHBD: పోలీస్ సేవలు భేష్.. అభినందించిన డీజీపీ

భారీ వర్షం నేపథ్యంలో మహబూబాబాద్లో నిలిచిన భారీ వరదకు రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తన పోలీస్ సిబ్బంది తో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, ఫుడ్, బిస్కెట్స్ను అందించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈదృశ్యాలను చూసిన డీజీపీ మహేందర్ రెడ్డి.. ఎస్పీ, పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ Xలో పోస్ట్ చేశారు.


