News April 16, 2025
వనపర్తి జిల్లాలో 19,500 మందికి డయాబెటిస్: కలెక్టర్

వనపర్తి జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి 3,09,643 మందికి మిషన్ మధుమేహలో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ పరీక్షల్లో 19,500 మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామని, వారిలో 3,000 మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారని గుర్తించామని చెప్పారు. డయాబెటిస్ గుర్తించిన వారందరికీ మందులతో పాటు, జీవనశైలిలో మార్పులను సూచించామని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.
News February 26, 2026
జగిత్యాలలో ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు ప్రవేశ పరీక్ష

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు ప్రవేశ పరీక్షను మార్చి 1న నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్ష జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంటముందే గుర్తింపు పత్రాలతో హాజరుకావాలన్నారు.
News February 26, 2026
VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.


