News April 16, 2025

వనపర్తి జిల్లాలో 19,500 మందికి డయాబెటిస్: కలెక్టర్ 

image

వనపర్తి జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి 3,09,643 మందికి మిషన్ మధుమేహలో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ పరీక్షల్లో 19,500 మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామని, వారిలో 3,000 మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారని గుర్తించామని చెప్పారు. డయాబెటిస్ గుర్తించిన వారందరికీ మందులతో పాటు, జీవనశైలిలో మార్పులను సూచించామని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

వెన్నెముక కింద డింపుల్స్ ఎందుకుంటాయంటే?

image

వెన్నెముక దిగువ భాగంలో డింపుల్స్ ఎందుకు ఉంటాయో వైద్యులు వివరించారు. వీటిని మహిళల్లో ‘వీనస్ డింపుల్స్’, పురుషుల్లో ‘అపోలో డింపుల్స్’ అంటారు. ‘తుంటి ఎముక చర్మాన్ని లిగమెంట్ లాగడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆడవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సహజ శరీర నిర్మాణం మాత్రమే. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. వెన్నెముక మధ్యలో ‘శాక్రల్ డింపుల్’ ఉంటే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.

News December 1, 2025

చిత్తూరు పీజీఆర్ఎస్‌కు 232 అర్జీలు

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 232 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించి 166, పోలీస్ శాఖ-7, పంచాయతీరాజ్-4, ఎండోమెంట్-1, డీపీవో-4, విద్యాశాఖ-2, వ్యవసాయ శాఖ-4, డీఆర్డీఏకి సంబంధించి 21 ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. వీటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

కాకినాడ జిల్లాలో 42 మంది స్క్రబ్ టైఫస్ వైరస్: DMHO

image

స్క్రబ్ టైఫస్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 42 కేసులు పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ సోమవారం తెలిపారు. 232 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. నల్లి మాదిరిగా ఉండే స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.