News March 10, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 40.7° ఉష్ణోగ్రత నమోదయింది. పానగల్ 40.4, విలియం కొండ 39.2, వెలుగొండ 39.0, దగడ 38.9, కేతపల్లి 38.6, పెబ్బేరు 38.4, మదనపూర్ 38.3, వనపర్తి 38.0, గోపాల్ పేట 37.8, ఆత్మకూర్ 37.8, ఘన్పూర్ 37.5, వీపనగండ్ల 37.4, శ్రీరంగాపూర్ 37.3, జానంపేట 37.3, రేవల్లి 37.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 9, 2025
పాలకొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

పాలకొండ మండలం పణుకువలస వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేకుంది. పణుకువలస జంక్షన్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న పొట్నూరు రామినాయుడును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రామినాయుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పాలకొండ మండలం బుక్కూరు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2025
డెక్ భవనంలో మార్పులు!

సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక పార్కింగ్ అంతస్తును ఆఫీస్ స్పేస్గా మార్చేందుకు వీఎంఆర్డిఏ సిద్ధమవుతోంది.
News December 9, 2025
సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


