News April 15, 2025

వనపర్తి జిల్లాలో TODAY TOP NEWS

image

✔️అమరచింత: సాగునీరు కావాలంటూ రైతుల రాస్తా రోకో కార్యక్రమం. ✔️ WNP: GREAT పోలీస్… యువకుడి ప్రాణాలు కాపాడారు. ✔️ రేవల్లి: పొట్టేళ్ల బండి పై స్వారీ చేసిన మాజీ మంత్రి. ✔️ WNP: పాలిటెక్నిక్ చౌరస్తా వద్ద డివైడర్లు ఏర్పాటు. ✔️ WNP: POCSO యాక్ట్ పై అవగాహన
✔️పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి

Similar News

News February 24, 2026

నెల్లూరు: తొలిరోజు 566 మంది డుమ్మా

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం తొలి పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో వరప్రసాదరావు తెలిపారు. జిల్లాలో 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 26,034 మంది విద్యార్థులకు గాను 25,468 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రకటించారు.

News February 24, 2026

2027 జనాభా లెక్కింపు కీలకం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 2027 జనాభా లెక్కింపు లక్ష్యాలను విజయవంతంగా సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన గృహ నిర్మాణ, గణన చార్జ్ స్థాయి అధికారుల శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు, పక్కా ప్రణాళికల అమలుకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26 వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు.

News February 24, 2026

241 రిపోర్టులు వచ్చాయి.. రాజమండ్రి మరణాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!

image

రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ వైఫల్య ఘటనల నేపథ్యంలో ఎంపీ పురందీశ్వరి మంగళవారం మెడికల్ క్యాంపును పరిశీలించారు. కలుషిత పాలు తాగి నలుగురు మరణించడం, చిన్నారులకు డయాలసిస్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. మొత్తం 293 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా, 241 రిపోర్టులు అందాయని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.