News April 8, 2025
వనపర్తి: తహశీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీపై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తహశీల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
Similar News
News July 9, 2025
ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.
News July 9, 2025
BHPL: త్వరలో నోటిఫికేషన్.. ఆశావహుల వ్యూహాలు

ఈ నెలాఖరులో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆశావహ అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రజలను కలుస్తూ వారి ఉద్దేశ్యాన్ని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్ కలిసి రాకపోతే పరిస్థితి ఏంటని పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలించకపోతే, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలు చేస్తున్నారు.
News July 9, 2025
నెలకు రూ.1.23 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21-25 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్/12వ తరగతిలో కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదవి ఉండాలి. చివరి తేదీ జులై 23. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.56,100 నుంచి రూ.1.23లక్షల వరకు ఉంది. https://joinindiancoastguard.cdac.in/