News February 27, 2026

వనపర్తి నుంచి మంత్రాలయం.. ఫోర్ లైన్ రోడ్డు: మంత్రి

image

వనపర్తి జిల్లా నుంచి మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్ మీదుగా ఈ రహదారి సాగుతుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. అలాగే, ₹400 కోట్లతో ఆత్మకూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

Similar News

News April 16, 2026

NRPT: ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో గుర్తించిన ప్రమాదం జరిగే స్థలాల్లో ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. అధికారులు పాల్గొన్నారు.

News April 16, 2026

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట: DPRO

image

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించే ‘హెల్త్ స్కీమ్’ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు జీవో నంబర్ 43ను విడుదల చేసినట్లు DPRO శ్రీనివాస్ తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందడానికి తమ వంతు ప్రీమియం సొమ్ము ₹1,250 చెల్లించాలని సూచించారు.

News April 16, 2026

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట: DPRO

image

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించే ‘హెల్త్ స్కీమ్’ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు జీవో నంబర్ 43ను విడుదల చేసినట్లు DPRO శ్రీనివాస్ తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందడానికి తమ వంతు ప్రీమియం సొమ్ము ₹1,250 చెల్లించాలని సూచించారు.