News February 27, 2026

వనపర్తి నుంచి మంత్రాలయం.. ఫోర్ లైన్ రోడ్డు: మంత్రి

image

వనపర్తి జిల్లా నుంచి మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్ మీదుగా ఈ రహదారి సాగుతుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. అలాగే, ₹400 కోట్లతో ఆత్మకూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

Similar News

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.

News April 14, 2026

కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

image

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.

News April 14, 2026

ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

image

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.