News February 27, 2026
వనపర్తి నుంచి మంత్రాలయం.. ఫోర్ లైన్ రోడ్డు: మంత్రి

వనపర్తి జిల్లా నుంచి మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్ మీదుగా ఈ రహదారి సాగుతుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. అలాగే, ₹400 కోట్లతో ఆత్మకూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
Similar News
News April 15, 2026
ఖమ్మం: కళ తప్పిన జంట నగరాలు

వేలాది కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు నేడు కళావిహీనంగా మారాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్ పాతప్లాంటు తొలగింపుతో కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీని ప్రభావం వర్తక, రియల్ ఎస్టేట్ రంగాలపై పడి వ్యాపారాలు కుదేలయ్యాయి. కార్పొరేషన్గా ఏర్పడినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు వాపోతున్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News April 15, 2026
నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 15, 2026
నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


