News March 15, 2025

వనపర్తి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్. 

Similar News

News November 28, 2025

రాచకొండలో 110 మంది ఈవ్‌టీజర్ల అరెస్ట్

image

రాచకొండ పోలీసులు మహిళల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో నవంబర్ 1 నుంచి 15 వరకు 110 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ వేధింపులు 34, సోషల్ మీడియా వేధింపులు 48, ప్రత్యక్ష వేధింపుల ఫిర్యాదులు 53 నమోదయ్యాయి. 7,481 మందికి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఫిర్యాదుల కోసం 8712662111 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

News November 28, 2025

హుస్నాబాద్: 1995లో సర్పంచ్.. 2 పర్యాయాలు ఎమ్మెల్యే

image

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు మొదట సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో ఆయన సింగాపూర్ సర్పంచ్‌గా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. అనంతరం ఫాక్స్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఛైర్మన్‌గా పనిచేసిన సతీష్ బాబు.. 2014, 2018లో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేశారు.

News November 28, 2025

తండాల్లో ఏకగ్రీవాల జోరు.. రుద్రంగి(M)లో 4 పంచాయతీలు ఏకగ్రీవం

image

సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఇప్పటివరకు నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు గురువారం ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. గైదిగుట్ట తండా సర్పంచ్‌గా ఇస్లావత్ కిషన్, వీరుని తండా సర్పంచ్‌గా గుగులోత్ మంజుల, చింతామణి తండా సర్పంచ్‌గా గుగులోత్ సింధుజ ఏకగ్రీవం అయ్యారు. ఇక బుధవారం రూప్లానాయక్ తండా సర్పంచ్‌గా భూక్య జవహర్‌లాల్‌ను గ్రామస్థులు ఏకగ్రీవం చేశారు.