News October 14, 2024
వనపర్తి: నేడు కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి రద్దు
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఐడిఓసి భవనంలో నేడు జరగనున్న ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో దిశా సమావేశం ఉన్నదని ఈ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తామన్నారు. ప్రజలు వ్యయ ప్రయాసలకు వచ్చి రేపు దరఖాస్తులు తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి రావొద్దని కోరారు.
Similar News
News October 14, 2024
MBNR: దసరాకు ఫుల్లుగా దావత్.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి జిల్లాల్లో 230 మద్యం దుకాణాలు ఉండగా..రూ.80.14 కోట్ల విక్రయాలు జరిగాయి. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచుతుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభిస్తుంది. పండగకు సొంతూరు వచ్చిన బంధువులు, మిత్రులతో కలిసి జోరుగా దావత్లు చేసుకున్నారు. బీరు, విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి.
News October 14, 2024
MBNR: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ
దసరా సెలవులు ముగియడంతో తిరిగి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉ.4 గంటల నుంచి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు సవాల్గా మారింది. MBNR, NGKL, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపాలని కోరుతున్నారు.
News October 14, 2024
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా”TODAY TOP NEWS”
✓BRS కేజీ టు పీజీ విద్యా ఉచితమని చెవిలో పూలు: ఎంపీ మల్లు రవి.
✓ కొడంగల్: దసరా పండుగకు కార్యకర్తలు నాయకులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.
✓ దసరా సండే స్పెషల్ కిక్కిరిసిపోయిన మద్యం, మటన్ షాపులు.
✓బొంరాస్ పేట: బైకు- కారు ఢీకొని వ్యక్తి మృతి.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర.
✓ అలయ్- బలయ్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా నేతలు.