News March 22, 2025
వనపర్తి: పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మన ఊరు మనబడికి సంబంధించి తుది దశకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తెచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
Similar News
News December 9, 2025
5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన: CM CBN

AP: గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘EX సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్యయోధులు, 1954కి ముందు అసైన్డ్ అయిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించాలి. అనుమతుల్లేని 430 రియల్ వెంచర్లలోని 15,570 ప్లాట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలి. 2.77 కోట్ల CAST సర్టిఫికెట్లు ఆధార్తో అనుసంధానించాలి’ అని సూచించారు.
News December 9, 2025
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2025
తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.


